Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తేదీ 14-12-2024 శనివారం రోజున హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా మధ్యాహ్నం 03:00 గంటల నుండి 04:30 గంటల వరకు హుజురాబాద్ పట్టణ ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ హుజురాబాద్ టౌన్ ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున హుజురాబాద్ పట్టణం మొత్తం మరియు బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE M శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.






