
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్ కు చెందిన స్కూల్ వ్యాన్ ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఆదివారం సెలవు కావడంతో స్కూలుకు సంబంధించిన వ్యాన్లన్నీ క్రీడా మైదానంలో ఉండగా ఓ పక్కగా ఉన్న వ్యాను నుండి మధ్యాహ్నం మంటలు వస్తున్నాయని గమనించిన స్థానికులు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి వేశారు. సుమారు వ్యాన్ దగ్ధం వల్ల సుమారు రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. వ్యాన్ దగ్ధం కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.




