
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదంలో, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు పోలీస్ వర్గాలో చర్చ జరుగుతుంది. కాగా పోలీస్ స్టేషన్ లో మరి కొంతమంది ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు సమాచారం.


కానీ ఎస్ ఐకి మద్దతుగా సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టడం కొందరిని ఆలోచింపజేస్తుంది.





