
స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్, డిసెంబర్ 21: పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 136 వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు స్వయంగా గణిత శాస్త్ర ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు, ఏకపాత్రాభినయాలు, పాటలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు జిజ్ఞాస పరీక్ష నిర్వహించి, అనంతరం బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు మాట్లాడుతూ.. గణితశాస్త్రంలోని చిన్న చిన్న మెళుకువలతో ఎంతటి సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని అన్నారు. గణితశాస్త్రానికి రామానుజన్ అందించిన కృషి చిరస్మరణీయమన్నారు. గణిత శాస్త్రం జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తుందని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సుహాసిని, వాసుదేవరావు, తులసీ దాసు, మల్లారెడ్డి, విజేందర్ రెడ్డి, మురళీ మోహన్, రమణ, విద్యార్థులు పాల్గొన్నారు.
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన చార్ట్ లు, మోడల్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ భారతీయ గణిత శాస్త్రవేత్తలు గణితంలో అనేక పరిశోధనలు చేశారని, నిత్యజీవితంలో మనకు గణితం ఎంతో ఉపయోగపడుతుందని, గణితం అన్ని సబ్జెక్టులకు మూలాధారమని, చాలామంది పిల్లలు గణితం అంటే చాలా హార్డ్ సబ్జెక్ట్ అంటారు కానీ, గణితమును ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తే లెక్కలు చాలా సులభమని, కష్టంతో కాకుండా ఇష్టపడి చేయాలని తెలిపారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ చాలామంది పిల్లలు పదవ తరగతి పూర్తి అయిన తర్వాత ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అవుతున్నారని, గణితం ఎంచుకుంటే తమ భవిష్యత్తు బాగుంటుందని, జాబ్ సంపాదించి జీవితంలో స్థిరపడటానికి మనకు ఒక దగ్గరి మార్గం అని తెలిపారు. తదనంతరం విద్యార్థులకు గణితం పైన క్విజ్ ప్రోగ్రాం నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. తదనంతరం పాఠశాల గణిత ఉపాధ్యాయులైన రమేష్, శ్రీనివాస్, ఉమాదేవి లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు
స్థానిక హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ 136 వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భముగా కళాశాల గణిత శాస్త్రం అధ్యాపకులు జితేందర్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు జిజ్ఞాస పరీక్ష నిర్వహించి, ప్రథమ, ద్వితీయ విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమం మొత్తం కళాశాల ప్రిన్సిపాల్ వి అంజనేయరావు ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు శ్రీ శ్రీనివాస రామానుజన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించి విధ్యార్థులనుద్దేచించి గణితశాస్త్రం లోగల చిన్న చిన్న తప్పులను, మెళుకువలను మరియు,రామానుజన్ గారి గురించి పిల్లలకు చెప్పారు. కార్యక్రమం చివరిలో ప్రథమ ద్వితీయ విజేతలను అభినందించి వారికి మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కళాశాల అధ్యాపకులు, వాసుదేవరావు, తులసీ దాసు, విజేందర్ రెడ్డి, మురళీ మోహన్, రమణ విధ్యార్థులు పాల్గొన్నారు.






