
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి డిసెంబర్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ హనుమాన్ దేవాలయ కమిటీని మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయ కమిటీ చైర్మన్ గా పట్టణానికి చెందిన కొలిపాక శంకర్, వైస్ చైర్మన్ గా బొల్లు పున్నంచందర్ ను నియమించారు. అలాగే డైరెక్టర్లుగా పట్టణానికి చెందిన ప్రతాప నాగరాజు, బుసారపు శంకర్, మాచర్ల నరేష్, ఎర్ర మధులత, గాలీబు రాజేందర్ లను నియమించారు. కాగా తమ నియామకానికి కృషిచేసిన, సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ భాద్యులు వొడితల ప్రణవ్, నాయకులు గూడూరి స్వామిరెడ్డి, పత్తి కృష్ణారెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.







