
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెరియార్ రామస్వామి 51వ వర్ధంతి సందర్భంగా జ్యోతిబాపూలే కమిటీ మాజీ చైర్మన్ సందేల వెంకన్న ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ విలువల పేరుతో బానిసత్వానికి బాటలు వేసి సామాజిక వివక్షతకు కారకులైన సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులకు ఎదురోడ్డి అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఈ సమాజంలో స్త్రీ కూడా పురుషునికి ఏమాత్రం తీసిపోదని స్త్రీల న్యాయపరమైన హక్కుల కొరకు ఆనాడే పోరాటం చేసిన మహనీయుడు పెరియార్ అని తెలిపారు. అట్టడుగు వర్గాల సామాజిక న్యాయం సర్వ మానవాళి ఆత్మ గౌరవం కొరకు అహర్నిశలు పాటుపడిన ఆదర్శమూర్తి పెరియారు రామస్వామి అని కొనియాడారు. వారి భావాలు సజీవంగా నిలిచే విధంగా ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమములో వివిధ నాయకులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, ముక్క రమేష్, కట్కూరి రాజేందర్, సొల్లు శంకర్, ఆడెపు శ్రీనివాస్, రామ్ సారయ్య, పసుల స్వామి, రామ్ రాజేశ్వర్, కొలిపాక సారయ్య, శనిగరం భాస్కర్, సాదుల రవీందర్, మొలుగూరి కొమురయ్య, వేల్పుల రత్నం, వేల్పుల భాస్కర్, పి రవీందర్, అచ్యుతాకర్, దాట్ల ప్రభాకర్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.

