Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సమ్మెట సంపత్ తల్లి నాగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయనను హుజురాబాద్ మండలంకి చెందిన వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంపత్ స్వగ్రామం చెల్పూర్ కి వెళ్లి పరామర్శించి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఆయనను పరామర్శించిన వారిలో మండలంలోని ధర్మరాజుపల్లికి చెందిన జక్కుల రమేష్, బోత్తలపల్లి నుంచి పంజాల రాజు, కాట్రపల్లికి చెందిన కోమటి శ్రీనివాస్, పోతిరెడ్డిపేటకు చెందిన పోశయ్య, వెంకట్రావుపల్లికి చెందిన సంపత్, పెద్దపాపయ్యపల్లి నుంచి ఇంద్రసేనారెడ్డి, హుజురాబాద్ టౌన్ నుండి గంట కిరణ్ రెడ్డి, రాంపూర్ కు చెందిన రామకృష్ణారెడ్డి తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.
[






