Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోగల పట్టణం, పలు గ్రామాలలో ఈనెల 28వ తేదీ శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ టోన్ ట్రాన్స్కో ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 132 kv హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతులు ఉన్న దృష్ట్యా శనివారం ఉదయం 11:00 గంటల నుండి 1:00 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడునని ఆయన తెలిపారు. హుజురాబాద్ పట్టణం, బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.






