
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మౌనం పాటించి ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్ కొలిపాక సారయ్య వేల్పుల రత్నం రిటైర్డ్ పిడి కొన్ని రాజి రెడ్డి, రవీందర్ మునీరుద్దీన్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.








