
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుస్నాబాద్ లో మంత్రి పొన్నము ప్రభాకర్ గౌడ్ ను హుజురాబాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గూడూరి రాజేశ్వరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హుజురాబాద్ హనుమాన్ కమిటీ చైర్మన్ గా నియమించిన సందర్బంగా మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపి ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని హనుమాన్ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి మంత్రి స్పందించి తగిన సమయం ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.







