Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపి ప్రియాంకగాంధీ జన్మదిన వేడుకలు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి స్థానిక నాయకులకు కేకులు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రియాంక గాంధీ నిండా నూరేళ్లు జీవించి దేశానికి మరిన్ని సేవలు అందించాలని తిరుపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, సీనియర్ నాయకులు గూడూరి స్వామిరెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ కొలిపాక శంకర్, పట్టణ శాఖ అధ్యక్షురాలు యేముల పుష్పలత, సీనియర్ నాయకుడు సందమల్ల బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, నాయకులు యండి అఫ్సర్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మోరె తిరుపతి, మేకల రాజుకుమార్, BR గౌడ్, Ch.విజేందర్, కడారి తిరుమల, గోస్కుల నాగమణి-మదుకర్, యండి తౌసీఫ్, యండి రియాజ్, లంకదాసరి ప్రవీణ్, మోతె కుమారస్వామి, మొలుగు రాధ తదితరులు పాల్గొన్నారు.






