Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సగర సంఘం క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అంటే మానవత్వమని మనుషుల మమత అనురాగాలే మరపురానివని మనసుల మదిలో మెదిలే మానవత్వమే మన సమాజాన్ని నడిపిస్తుందని హుజురాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు దేవునూరి శ్రీనివాస్ సగర, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, కోశాధికారి కాటిపెళ్లి కుమారస్వామిసగర, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ సగర, మరియు మాజీ సర్పంచ్ కురిమిండ్ల రాజయ్య సగర, మండల తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు గుంటి అశోక్ సగర, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కురిమిండ్ల మనుసుకేష్ సగర, కార్యవర్గ సభ్యులు కురుమ రవీందర్ సగర తదితరులు ఈ సందర్బంగా పాల్గొని ఏసీబీకి కృతజ్ఞతలు తెలిపారు.






