
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం( తోకలపల్లి )లోని చింతి రెడ్డి అశోక్ రెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని తాజా మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి- సురేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు తన వంతుగా ఎల్లవేళల ముందు ఉంటానని మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ పి సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధవాసుదేవరెడ్డి, భాస్కర్, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

