
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం వేద పండితులు అష్టోత్తర శత కలశాభిషేకం, శిఖర కలశ ప్రతిష్టాపన పూజలు, సంప్రోక్షణ, ఆంజనేయ మూల మంత్ర హవనం, శ్రీరామ శాంతి కల్యాణం, శాస్త్రోకత్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ పూజ ప్రాశస్యాన్ని భక్తులకు వివరించారు. ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు నందకిషోరాచార్యులు, శ్రీధర్ ఆచార్యులు, కిరణ్ కుమారచార్యులు, సుజితాచార్యులు, వెంకట్రావు, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.












