
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
జన వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదిన వేడుకలు సోమవారం హుజురాబాద్ మున్సిపల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. మండలంలో ఉన్న పలువురు అనాధ బాలల జన్మదిన వేడుకలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతి ఏడాది అనాధ బాలలకు జన్మదినం జరపడం ఆలవాయితీగా మారింది. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ లతా ప్రతాపరెడ్డి, ఆఫీస్ స్టాఫ్ జ్యోతి, పులుగు లతారెడ్డి, మేనేజర్ ఖజాబీ, రజిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


