
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఇరువురి కుటుంబ సభ్యులను హుజురాబాద్ తాజా మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణిసురేందర్ రెడ్డి సందర్శించి వారిని పరామర్శించారు. చెల్పూర్ కు చెందిన బండారి రమ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారి కుటుంబాన్ని వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే శనిగరం ఐలయ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారికి రూ.5000 ఆర్థిక సహాయంను మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డి అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధవాసుదేవ రెడ్డి, శంకరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ విశ్వనాధ్, రాజు, చిరంజీవి, రాకేష్, రమేష్, సృజన్,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
