
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల ఎకైక కుమారుడు కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించక పోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయిన కన్పించక పోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యం అయింది.
