
Oplus_131072
కుమార్, స్వర్ణోదయం రిపోర్టర్ గోదావరిఖని: చంపాపేటలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోసులను వెంటనే అరెస్ట్ చేయాలని, అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకరావాలని, 41 ఏ సీఆర్పీసీ ని (BNSS 30(3)ని అమెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు బుధవారం ఖని కోర్ట్ ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగి పోతున్నాయని, గతంలో వామన్ రావు దంపతుల హత్య, నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ ను నడిరోడ్డుపై హత్య చేయటం హేయమైన చర్య అని అన్నారు. వెంటనే బాధ్యులపై చట్టరీత్యా చర్య తీసుకొని రక్షణ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశం లో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. న్యాయవాద వృత్తికి గుదిబండగా ఉన్న 30(3)ని అమెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు గోసిక ప్రకాష్, ఇరుగురాల మహేందర్, సంతోష్, గొర్రె రమేష్, నడిపల్లి కిషన్ రావు, చందాల శైలజ, డెసర్ట్ అంజయ్య, గుల్ల రమేష్, బీద సమ్మయ్య, కోసన శ్రీనివాసరావు, పేర్ల మనోహర్ ,జూపాక వెంకట్, అసంపల్లి రవీంద్ర, రాగం శ్రీధర్, పెట్టం వెంకటేశ్వర్లు, కిరణ్ జీ, పులిపాక రాజకుమార్ తదితరులు ఉన్నారు.
