
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐకమత్యానికి నిష్టకు రంజాన్ పండుగ ప్రతీక ఆని, రంజాన్ పర్వదినాన్ని ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి హుజరాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్లో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం ఉన్నంతకాలం ముస్లింలు నిష్టతో నియమ నిబంధనలతో భగవంతుడి సేవలో ఉంటారని, తమకు ఉన్నదానిలో బీదవారికి దానం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ ఆయన ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, తాసిల్దార్ కనకయ్య, డిటీ నవాజ్, ఆర్ ఐ రంజిత్ రెడ్డి, మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండి ముజాహిద్ హుస్సేన్, ముస్లిం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా పతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు..





