
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ ప్రజలకు, ప్రత్యేకించి ముస్లిం సోదరులు, సోదరీమణులకు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్ లు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రంజాన్ పవిత్రత, సహనాన్ని, సేవా భావాన్ని, ప్రేమను బోధించే దివ్య మాసమని పేర్కొన్నారు. అల్లాహ్ అనుగ్రహంతో అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నిండాలని ఆకాంక్షించారు. అంతేకాక మతసామరస్యం, స్నేహభావం మరింత పరిపుష్టం కావాలని, సమాజంలో సౌహార్ద వాతావరణం ప్రబలాలని వారు పిలుపునిచ్చారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్