
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు హుజురాబాద్ మండల పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో వాడ, వాడలా పాదయాత్ర చేసారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగాన్ని అవమానిస్తుంది అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మరియు భారత దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.







