
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ లోని శివ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ట్రస్ట్ చైర్మన్ శ్రీ క్యాస చక్రధర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కమిటీ వారు వచ్చిన భక్తులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు చలువ పందిర్లు, మరియు కూలర్లు, మజ్జిగ మరియు స్వామివారి పానకము అందజేశారు. కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ మరియు భక్తులందరికీ స్వామివారి అక్షింతలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలను గందె నాగరాజు దంపతులు మరియు ముత్యాల తలంబ్రాలను క్యాస చక్రాధర్ దంపతులు మరియు పుస్తే మట్టెలు వినాయక జువెలరీస్ హన్మకొండ వారు మజ్జిగను నాగార్జున డైరీ వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు చెరుకుపల్లి శ్రీధర్ ఆచార్యులు, బాసర దేవాలయం పూజారి సంజయ్ చారి, రామాచారి, నిఖిల్ శర్మ మరియు కమిటీ సభ్యులు బుర్ర ఆగయ్య, కాసర్ల శ్రీహరి, భూసారపు బాపూరావు, ఆకుల సదానందం, శనిగరపు నరేందర్, క్యస కమల్ కుమార్, బుర్ర నటరాజ్ భూసారపు శ్రీనివాస్ గట్టు మహాదేవ్, గుడ్డెలుగుల చైతన్య, యథీపతి అరుణ్ కుమార్, చిదురాల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.











