Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 23న ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు రావలసిందిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం కరీంనగర్లో ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ క్యాస చక్రధర్, ఆలయ అర్చకులు చెరుకుపల్లి శ్రీధరా చర్యులు, ఆలయ కమిటీ సభ్యులు అరుణ్, శ్రవణ్ మరియు బీజేపీ నాయకులు గంగిశెట్టి రాజు పాల్గొన్నారు.






