
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: అర్థరాత్రి 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పీవోకే తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసిన వాటిలో ఉన్నాయి. దీంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.



