
– స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు సరస్వతిఘాట్ లో పుష్కర స్నానమాచరించారు. అనంతరం ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని త్రివేణిసంగమంలో సరస్వతి పుష్కరాలు ఆదివారం 11వ రోజుకు చేరుకున్నాయి.. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఉన్నారు.

కాలేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్న గవర్నర్ దంపతులు..