
– స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసుల విజ్ఞప్తి.
– ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమంలో విషాదం.
స్వర్ణోదయం ప్రతినిధి, బెంగళూరు: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ IPL(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో నిన్న జరిగిన ఫైనల్ లో పంజాబ్ జట్టు పై గెలిచిన RCB రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది, దీంతో ఈరోజు బెంగళూరు నగరంలోని చిన్న స్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది, దీంతో మొదట ఆరు మంది చనిపోగా ఆసుపత్రులకు తరలించే సమయంలో మరో నలుగురు చనిపోయారు దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య పదికి చేరింది….

తొక్కిసలాట ఘటన..14 ఏళ్ల బాలిక మృతి
తొక్కిసలాట ఘటన..14 ఏళ్ల బాలిక మృతి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 14 ఏళ్ల బాలిక మరణించింది. RCB జట్టు ఆటగాళ్లను చూడటానికి వెళ్లి తొక్కిసలాటలో చిక్కుకుని దివ్యాంశి అనే బాలిక ఊపిరాడక మరణించింది.దీంతో బాలిక కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, కర్ణాటక మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణాలు తిరిగిరావు కదా!’ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని, గాయపడినవారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని ప్రకటన విడుదల చేశారు.
మృతుల కుటుంబాలకు RCB ప్రైజ్ మనీ?: నెటిజన్ల డిమాండ్
మృతుల కుటుంబాలకు RCB ప్రైజ్ మనీ?: నెటిజన్ల డిమాండ్
RCB విక్టరీ పరేడ్ విషాదం తర్వాత కొత్త డిమాండ్ తలెత్తింది. RCBకి లభించిన రూ.20 కోట్ల ప్రైజ్మనీని మృతుల కుటుంబాలకు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆ డబ్బు వారి ప్రాణాల కంటే ఎక్కువేం కాదు అంటున్నారు. నిజమైన అభిమానం ఉంటే RCB ఈ చొరవ తీసుకోవాలంటూ భావోద్వేగంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఆటగాళ్లు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారింది.


బెంగళూరు ఘటన హృదయ విదారకం: ప్రధాని మోదీ
బెంగళూరు ఘటన హృదయ విదారకం: ప్రధాని మోదీ
బెంగళూరులోని RCB విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు.

బెంగళూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: కిషన్రెడ్డి
బెంగళూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: కిషన్రెడ్డి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని తెలిపారు.స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని అన్నారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తొక్కిసలాట ఘటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో
తొక్కిసలాట ఘటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో
బెంగళూరులో RCB విజయోత్సవం విషాదంగా మారింది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అభిమాన ఆటగాళ్లను చూడటానికి వచ్చిన ఆ బాలుడు చివరికి శవంగా ఇంటికి చేరాడు. పోలీసులు అతడిని చేతుల్లో మోసుకుంటూ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కేరింతలతో జరగాల్సిన వేడుక కన్నీటితో ముగియడం అభిమానులను కలిచివేస్తోంది.
