
– రాజ్యాంగమే మా జాతులను కాపాడుతుంది ఇది దళిత జాతుల విజయం
– చట్టం సామాన్య ప్రజలకు, పోలీసులకు సమానమే అని నిరూపించబడింది
– మహేందర్ కుటుంబానికి ప్రాణహాని ఉంది వారికీ ఏమైనా జరిగితే ఎస్సై భార్గవ్ దే బాధ్యత – తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత నెల రోజుల కిందట దళితుడైన బత్తుల మహేందర్ ను ట్రైనింగ్ ఎస్సై భార్గవ్, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆకాష్ రెడ్డి, అజయ్ ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో దళిత సమాజం విజయంగా భవిస్తున్నామనీ హుజూరాబాద్ పట్టణంలో గల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపూ సంపత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై చట్టం పై గౌరవంతో పోరాడాము ఆ పోరాట ఫలితమే ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ కానిస్టేబుల్స్ పై కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే పోలీస్ అధికారులు తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోవద్దని తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అలాంటప్పుడే పోలీసులపై గౌరవం ఉంటుందని లేకుంటే పోలీస్ వ్యవస్థ పైనే నమ్మకం పోతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా అన్యాయాన్ని గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినందుకు వారికి ప్రజల్లో గౌరవం పెరిగిందని అన్నారు. మా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగిన తప్పకుండా వారి పక్షాన పోరాడుతామని, మా జాతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని తప్పకుండా రాజ్యాంగం పరిధిలో పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ఎస్సై భార్గవ్ ను కానిస్టేబుల్స్ ను వెంటనే సస్పెండ్ చేస్తూ అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితుడు బత్తుల మహేందర్, బాధితుడి తల్లి బత్తుల శంకరమ్మ, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ న్యాయవాది జీడి రవితేజ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదిగ, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్

ఎస్సై భార్గవ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన దృశ్యం..