
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులుగా బాధ్యతలు స్వీకరించినందున మాల మానాడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆయనకు అభినందనలు తెలిపారు. జై వివేక్ జై మాల మహానాడు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు సొల్లు బాబు, ఎడ్ల విజయ్ కుమార్, వేముల పుష్పలత, సొల్లు సునిత, జూపాక మల్లేశ్వరి, కాండారి కృష్ణారావు, పసుల స్వామి, మధ్యల సునందం, ఎడ్ల విజయభాస్కర్, పిట్టల రాజమౌళి, జూపాక శ్రీనివాస్, కోడెం నర్సింగారావు, పాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.


వివేక్ కు మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తున్న మాల మహానాడు నాయకులు..





