
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమనేని పరుశరామ్ రావు తల్లి లింగమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరామర్శించి సంతాపం తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు, ఓడేడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాపారావు, రాజేశ్వర్ రావు, సదానందం తదితరులు ఉన్నారు.

