
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ప్రతీక అని మరియు మతసామరస్యానికి నాంది పలికేటువంటి విశిష్టమైన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంలోని బండ అంకూస్ వాడలో గల అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి బోనాల ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు ఆయన ప్రాంగణంలో అందంగా అలంకరించినటువంటి అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి పూజ కార్యక్రమాన్ని ఆచరించి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడమాసంలో జరుపుకునేటువంటి ఈ బోనాల పండుగ త కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య చాలా ఘనంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే పండుగ అని ఈ పండుగ ద్వారా కుటుంబాలలో సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు వెళ్లి విరిస్తాయని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో నెల రోజుల పాటు వేడుకగా జరిగే ఈ సంబరాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరుపుకుంటారని తెలిపారు.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సైతం ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు విద్యాసంస్థల మీదనే కాకుండా విద్యార్థుల మీద వారి పరివారాల మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.
వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు అమ్మవారి నృత్యాలు, పోతురాజు వేషాలు చాలా ఆకర్షణంగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి గ్రామదేవతల వైభవం నృత్య ప్రదర్శన ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రాంగణానికి వన్నె తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


బోనాల జాతర వేడుకలో విద్యార్థుల ప్రదర్శనలు..


బోనాల వేడుకలను ప్రారంభించి పోతురాజుల విన్యాసాలను తిలకిస్తున్న వీఎన్ఆర్, ఉపాధ్యాయులు..


ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి, వారితో విఎన్ఆర్
———————+++++++——————
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
———————-++++++++++—————
&వార్షికోత్సవ శుభాకాంక్షలు &






