
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (జలపల్లి)జూలై 13 : మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరామ కాలనీలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతూనయి. శ్రీరామ కాలనీ పోచమ్మ ముఖ్య దేవాలయంలో అమ్మవారు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తునది. దేవాలయాన్ని రకరకాల పూలతో అలంకరణ చేశారు దేవల కమిటీ సభ్యులు. దేవాలయానికి రకరకాల పూలను బహుకరించారు గణపతి చించోలే. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు గణపతి చించోలే. ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేస్తూ, శ్రీరామ కాలనీ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని దేవాలయం కమిటీ తరఫున పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ కమిటీ ఏర్పడిన తర్వాత శ్రీరామ కాలనీ పోచమ్మ దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. కాగా శ్రీరామ కాలనీ పోచమ్మ ఆలయా అలంకారానికి వివిధ రకాల పూలను అందించారు గణపతి చించోలే. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






