
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో జరుగుతున్న 100 రోజుల పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ వి. సాయినాథ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో జమ్మికుంట రోడ్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక మొక్కను నాటారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి జరుగుతున్న పనులను ఆయన మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీకి పారిశుధ్యం కోసం వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా హుజురాబాద్ కు 1.73 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వాటి ఖర్చు చేస్తే మరిన్ని నిధులు మంజూరు అవుతాయని అన్నారు. పట్టణంలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, పలువురు వార్డు ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.



మొక్కలు నాటి నీళ్ళు పోస్తున్న మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సాయినాథ్..







