Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులు విజయం సాధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.

——————-+++++++++——-++++++———-
&&లోకల్ యాడ్స్&&
———————++++++++———++++++——–
##దసరా శుభాకాంక్షలు##










