Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలో పశువుల మేత కోసం ఉంచిన గడ్డివాము ఆదివారం అనుమానాస్పదoగా దగ్ధమైంది. వివరాలలోకి వెళితే…
మామిళ్ళవాడకు చెందిన ఎండి హమీద్ తన పశువుల కోసం గడ్డిని కొనుగోలు చేసి భద్రపరుచుకున్నాడు. కాగా ఆదివారం గడ్డివాములో మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు కావాలని నిప్పంటించి ఉండవచ్చని, దీనివల్ల తనకు రూ. 15,000 రూపాయల నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితులను గుర్తించాలని కోరారు.






