
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కాంగ్రెస్ సేవాదళ్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యవర్గాలను ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి ప్రణవ్ బాబు సమక్షంలో నియమించినట్లు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు పత్తి మధుబాబు, హుజురాబాద్ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు నరెడ్ల వినోద్ రెడ్డిలు తెలిపారు. హుజురాబాద్ టౌన్ కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా పూదరి కృష్ణ, జమ్మికుంట టౌన్ కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా బండి పవన్, జమ్మికుంట మండల కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా రాచపల్లి రాజకుమార్, వీణవంక కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా ఆవాల రామకృష్ణ, ఇల్లందకుంట కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా గంధం రవీందర్, కమలాపూర్ కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా శనిగారపు రమేష్ కుమార్ లుగా నియమించినట్లు వారు తెలిపారు. కాగా వారికి నియామక పత్రాలను అందచేయడం జరిగింది. తదంతరం అధ్యక్షులు అందరూ ప్రణవ్ బాబుని మరియు జిల్లా అధ్యక్షులు పత్తి మధుబాబు, వినోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.


హుజురాబాద్ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు నరెడ్ల వినోద్ రెడ్డినీ సత్కరిస్తున్న నూతన అధ్యక్షులు





