
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటన ప్రకారం రేపు (సోమవారం, అక్టోబర్ 27)న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమం జరగాల్సిన కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్ డ్రా కార్యక్రమం నిర్వహించనున్నందున ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.





