
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ సిఎస్ఐ చర్చిలో ఆదివారం కృతజ్ఞతల కానుకల పండుగ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ ఫాస్ట్ రేట్ చైర్మన్ రెవరెండ్ ఈ జాన్ బాబు పాస్టర్ కృతజ్ఞతల కానుక పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, కోలాటాలు ఆడి, ఆటపాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్రేట్ సెక్రటరీ సొల్లు బాబు, కమిటీ సభ్యులు శైలజ, ఎన్ పద్మ, ఝాన్సీ ప్రియా, రిషిక, బ్యులా, గూడెపు రవీందర్, సొల్లు సునీత, జి సురేఖ, ఏ ప్రభావతి, యేముల పుష్పలత, ప్రియాంక శరణ్, సొల్లు మహేందర్, స్రవంతి, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న చర్చ్ ఫాస్ట్ రేట్ చైర్మన్ రెవరెండ్ ఈ జాన్ బాబు పాస్టర్


గీతాలు ఆలపిస్తున్న సంఘ సభ్యులు…








