Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 1.99 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి , కొత్తపల్లి మున్సిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొందని ఆయన తెలిపారు. ఈ నిధులతో హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో కూరగాయల, మాంసం మార్కెట్ అభివృద్ధి కోసం త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.






