
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పోలంపల్లి సమ్మక్క కుటుంబ సభ్యులను ఆదివారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించి పరామర్శించారు. సమ్మక్క మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమ్మక్క కుమారులైన మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, చిన్నక్క విజయలత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శనురెడ్డిలతో మాట్లాడి సంతాపం తెలిపారు. కాగా ఈటెల వెంట పలువురు నాయకులు ఉన్నారు.

సమ్మక్క చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్..





