
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మోలుగు పూర్ణచందర్ కలుసుకొని పుష్పగుచ్చాలిచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండ నూరేళ్లు జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా పూర్ణచందర్ ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అంజాదుల్లా ఖాన్, సాగర్ రెడ్డి, బొంగోని సంతోష గౌడ్, ఎండి హర్షద్, తాటిపాముల రాము, అకిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యేకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలుపుతున్న పూర్ణచందర్…

పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షూభాకాంక్షలు తెలియజేస్తున్న పూర్ణచందర్ హుజురాబాద్ కు చెందిన నాయకులు..





