
– హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ హవా..
– ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు.
– బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంలో ఒక్కటైనా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేకపోయారు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం కొనసాగుతుందని దాంట్లో భాగంగా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ (డీసిసి) కార్యాలయంలో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్, మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ, శాసన మండలి సభ్యుడు బలముర్ వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మెన్ నరేందర్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో పాటు ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నుండి అధిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎన్నికయ్యారని, నిధులు కేటాయించే విషయంలో ఎక్కువ నిధులు హుజురాబాద్ కేటాయించాలని కోరారు. హుజూరాబాద్ లో ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఎన్ని ప్రచారాలు చేసినా కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఆపలేకపోయాయని, ఇదే స్ఫూర్తిని ప్రభుత్వం నుండి వచ్చే పనులను, సంక్షేమ పథకాలు ప్రజలు అందించేలా కృషి చేసేలా కృషి చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో గెలుపొందిన నూతన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో ప్రణవ్ బాబు, మంత్రి పొన్నం






