
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మునిసిపల్ పరిధిలోని కేసి క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రోజున తిరువీధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోదా, పద్మావతి, సహిత వెంకటేశ్వర్లు హుజురాబాద్ తిరువీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో స్వాగతించి దేవుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులు స్వామి రథం వెంట పాల్గొన్నారు.


ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్న పూజారులు..







