Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీ శనివారం రోజున కందుగుల ఉప మండల కేంద్రంలో 8 గ్రామాలతో నిర్వహించబోయే కందుగుల బొడ్రాయి ఆవరణంలో విరాట్ హిందూ సమ్మేళనంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని గోడ పత్రిక కరపత్రంను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విరాట్ హిందూ సమ్మేళనం సమితి అధ్యక్షులు కొండం రాజేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు జాలి రాఘవరెడ్డి, గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్, ఉపాధ్యక్షులు కుసుమ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నీలం కుమార్, కోశాధికారి కంకణాల రమేష్ రెడ్డి మరియు జిల్లా శారీరక ప్రముఖ కమటం వినీత్, సమితి సభ్యులు పాల్గొన్నారు.

విరాట్ హిందూ సమ్మేళనం గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న సమ్మేళన నిర్వాహకులు…





