
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విజ్ఞాన అభివృద్ధికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనీ హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజురాబాద్ గ్రంధాలయంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల ఉపయోగించుకోవాలని అన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. గ్రంథాలయాల వల్ల విజ్ఞానం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, లైబ్రేరియన్ కనకలక్ష్మి, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం , చందుపట్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.




మాట్లాడుతున్న ఏంఈవో శ్రీనివాస్





