
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి కార్మికులతో కలిసి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. భారీ బందోబస్తు మధ్యన మృతుడి ఇంటికి మృతదేహాన్ని తరలించారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (ఫైల్ ఫోటో)

బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని అడ్డుకునీ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు..





