
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జనాభా గణన 2027లో భాగంగా జనాభా గణన నిర్వహించే ఎన్యుమరేటర్ల, సూపర్ వైజర్లకు ఇచ్చిన శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ శిక్షణ శిబిరాన్ని ఈనెల రెండున ప్రారంభించి సోమవారం ముగించారు. ఈ సందర్భంగా
జనగణన అధికారి, గణాంక అధికారి కిషన్ రావు ట్రైనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించి, ట్రైనింగ్ తీసుకుంటున్న ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు తగు సలహాలు సూచనలు అందించారు.

ఈ కార్యక్రమములో కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ నాయిని అశ్వినీ గాంధీ, ఎన్యుమరేటర్లు సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జనగణన అధికారి, గణాంక అధికారి కిషన్ రావు





