
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా పాలనలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, మరియు మున్సిపల్ కమిషనర్ కిషన్ లు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళ సంఘాల ఏర్పాటు, ఇందిరా మహిళా శక్తి లోన్ మేళా, ఉద్యమి రిజిస్ట్రేషన్, పీఎం ఎఫ్ఎంఈ, ఏఎల్ ఎఫ్ అండ్ టిఎల్ ఎఫ్ లతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్స్ సొల్లు సునీత, శ్రీలేఖ, సందమల్ల పుణ్య, సుమలత, కొండ ప్రశాంతి, కో ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, మొగిలి, గోస్కుల రాజకుమార్, దామెర అనూష, తల్లపెల్లి రమేష్ గౌడ్, భారతి, లావణ్య, నాంపల్లి శ్రీనివాస్, మనోజ్ గౌడ్, వెంకటేశ్వర్లు, వెంకట్ నాయక్ , కాలిక్ హుస్సేన్, మంజుల, మెప్మా టిఎంసి మల్లీశ్వరి, రమ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

చీరలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని

చీరలు పంపిణీ చేసిన మహిళలతో చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు.. మెప్మా సిబ్బంది.






