
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో బిజెపి నాయకులు పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రధాని మోదీ పిలుపుమేరకు తాము మొక్కలు నాటినట్లు వారు తెలిపారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం బాగవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, బోరగాల సారయ్య, ఆవుల సదయ్య, కోలుగురి అనిల్, నీలం రవీందర్, పురాణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


పలు ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్న బిజెపి నాయకులు…







