
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సుంకరి బాలమ్మ కుటుంబ సభ్యులను శనివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించి పరామర్శించారు. మృతురాలి మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ మండల ఉపాధ్యక్షుడు బండి రమేష్, బిఆర్ఎస్ నాయకులు కుంట తిరుపతిరెడ్డి, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, కాసనగొట్టు కిరణ్, సర్పంచ్ కత్తుల రాజు, మాజీ సర్పంచు తొగరు బిక్షపతి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





