
స్వర్ణోదయం ప్రతినిధి సిరిసిల్ల:
శవాల కాల్చే స్మశాన వాటికను కూడా వదలని అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లోని పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ.7000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను లంచం అడిగిన భాస్కర్ రావుపై బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వళ పన్నీ ఆయనను పట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడదంతో అదుపులోకి తీసుకున్నారు.